Connect with us

Telugu Desam Party

కాన్సస్ సిటీలో అభిమానాన్ని చాటుకున్న ఆడపడుచులు, ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published

on

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 28న అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవస్థాపకుడు, మహానేత “అన్న ఎన్టీఆర్” పఠానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మహిళా మద్దతుదారులతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్థానిక హార్డ్ కోర్ టీడీపీ మద్దతుదారులైన రావు ద్రోణవల్లి, వెంకట నల్లూరి, అరుణ్ కొమ్మినేని, రథన్ కొమర్నేని, నిరుపమ కొమ్మినేని మరియు మరికొంతమంది ప్రసంగాలను అనుసరించారు. “జై తెలుగు దేశం”, “జై బాబు”, “జోహార్ అన్న ఎన్టీఆర్” అంటూ భారీ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

కాన్సస్ సిటీ టీడీపీ బృందం కోడె శ్రీనివాస్, ప్రకాష్ కన్యాదార, వెంకట్ గొర్రెపాటి, శ్రీనివాస్ దామ, సోమశేఖర్ పెమ్మసాని, నాయుడు వట్టిగుంట, సురేష్ తుమ్మల, గోపి మాదాల, గౌతం నల్లూరి తదితరులు కేక్‌ కటింగ్‌తో వేడుకను ముగించారు. హాజరైన వారందరూ పార్టీకి మద్దతుగా ప్రమాణం చేసి, రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected