Connect with us

Government

బ్రేకింగ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణుల దాడి. గవర్నర్, కేంద్రాన్ని సంప్రదించిన చంద్రబాబు.

Published

on

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి చేసి, అద్దాలు, సామాగ్రి పూర్తిగా ధ్వంసం చేశారు.

విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. ఏపీలో డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలుగుదేశం నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డీజీపీ ఆఫీస్ ఉన్నప్పటికీ ఈ దాడులు జరగడం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితికి అద్దం పడుతుంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి హుటాహుటిన బయల్దేరారు.

దాడుల విషయాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు వివరించారు. కేంద్ర హోంశాఖ అధికారులు మరియు అమిత్షాతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర బలగాల సాయం కోరారు. దాడులకు నిరసనగా టీడీపీ రేపు రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected