Connect with us

News

అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి

Published

on

అమరావతిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ నేతృత్వంలో ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు ఒక పధకం ప్రకారం దాడిచేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపైనే దాడికి దిగడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని నిపుణులు అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు దాడి వార్త తెలుసుకొని అక్కడికి వచ్చి బాగానే ప్రతిఘటించారు. దాడికి సంబంధించి వీడియో ఒకటి టీడీపీ వారు బయటకు విడుదలచేశారు. గతంలో జీ కొండూరులో దేవినేని ఉమా పై దాడి చేసింది కూడా ఈ గంజాయి, బ్లేడ్ బ్యాచే అని ఆరోపిస్తున్నారు. వైసీపీ పెంచి పోషిస్తున్న రౌడీలు వీళ్ళు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ ఎటాక్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected