Connect with us

Events

జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో టీడీపీ మినీ మహానాడుకు ఏర్పాట్లు

Published

on

మునుపెన్నడూ లేని విధంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరుగబోతోంది. 2018 నుంచి జర్మనీ దేశంలో ప్రతి సంవత్సరం టీడీపీ మహానాడును తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక పండుగ లా చేసుకుంటారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్ పద్ధతి లో జరుపుకున్నారు. కానీ ఈసారి పెద్ద ఎత్తున్న సంబరాలు జరగాలి అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు నిర్ణయించారు.

ఏ సభలో అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అవమానం జరిగిందో అదే సభకు గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో పంపడానికి కృషి చేస్తున్నాం అని తెలుగుదేశం పార్టీ జర్మనీ సభ్యలు పేర్కొన్నారు. ఈ మహానాడులో కొంత మంది ముఖ్యమైన రాష్ట్ర నాయకులని జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించాం అని, వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ జర్మని కార్యకర్త లలో స్ఫూర్తి ని నింపే సందేశాలు ఇప్పిస్తాం అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య సభ్యులు వెంకట్ కాండ్ర, శ్రీకాంత్ కుడితి, నరేష్ కోనేరు, పవన్ కుర్రా, సుమంత్ కొర్రపాటి, అనిల్ మిక్కిలినేని, టిట్టు మద్దిపట్ల, శివ, వంశి దాసరి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected