Connect with us

Events

Dallas: గాంధీ మెమోరియల్ చెంత భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Published

on

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్ లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ చెంత భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోనే అతి పెద్దదైన ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ చెంత అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయుల మధ్య ఆగష్టు 15న కోవిడ్ నిభందనలకు లోబడి వేడుకలు జరగడం విశేషం.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర పిల్లలు, పెద్దల కేరింతల మధ్య భారత జాతీయ పతాకావిష్కరణ చేసి, మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. డా. తోటకూర మాట్లాడుతూ గాంధిజీ తో సహా ఎంతోమంది జాతీయ నాయకులు, స్వాతంత్య్ర యోధుల త్యాగ ఫలితంగా సాధించికున్న 75 సంవత్సారాల స్వాతంత్య్ర భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా, ఇప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో కనీస వసతులైన మంచి నీరు, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలు లేకపోవడం శోచనీయం అన్నారు. చిత్తశుద్ధితో పాలకులు, అంకిత భావంతో ప్రజలు కలసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారత దేశాభివృద్ధిలో తమ వంతు కృషితో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, కమ్యూనిటీ నాయకులు ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, దినేష్ హూడా, షబ్నం మోడ్గిల్, ఎం.వి.ఎల్ ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, పులిగండ్ల విశ్వనాధం, ములుకుట్ల వెంకట్ లు, పిల్లలు పెద్దలు చిరు జల్లుల మధ్య గాంధీజీకి నివాళులర్పించి, మిటాయిలు తింటూ ఆహ్లాదంగా గడిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected