Connect with us

Government

కనెక్టికట్ ఎన్నారై టీడీపీ: చంద్రబాబు కుటుంబంపై సంస్కారహీన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుల దిష్టిబొమ్మలు దహనం

Published

on

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో సమావేశమై ఖండించారు.

ముందుగా సమావేశానికి హజరయినటువంటి తేలుగుదేశం సైనికులు పసుపు ప్రతిజ్ఞ చేశారు. ఏ సభలో అయితే నా నాయకుడు చంద్రబాబు గారు అవమానించబడ్డారో ఆ సభలోనే ఆయనని రారాజుగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తారని, ఆచరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మరియు వల్లభనేని వంశీ దిష్టిబొమ్మలను దహనం చేసారు.

ఆ తర్వాత మాట్లాడిన కార్యకర్తలు అసమ్మత, సభ్యతా సంస్కారం లేని వైసీపీ వాళ్ళు అధికార మదంతో కొట్టుకొని ఇట్లాంటి బాష మాట్లాడుతున్నారో ఆ అధికారం వాళ్ళ దగ్గర లేనప్పుడు వారు పిచ్చి కుక్కలతో సమానం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయటం ఖాయమని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected