Connect with us

Concert

సరస్వతి సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కర్నాటిక్ వీణ కచేరీ

Published

on

ఏప్రిల్ 15 న అట్లాంటాలో సరస్వతి సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కర్నాటిక్ వీణ కచేరీ నిర్వహిస్తున్నారు. డులూత్ లోని స్థానిక యుగళ్ కుంజ్ రాధా క్రిష్ణ గుడిలో ఈ ఆదివారం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ వీణ వాయిద్యకారులు తిరుపతి శ్రీవాణి యల్లా గారు మరియు ప్రఖ్యాత మృదంగం వాయిద్యకారులు మధుబాబు యల్లా గారు పాల్గొననున్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన శ్రీవాణి గారు ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో సంగీత విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న విషయం అందరికి విదితమే. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం, విరాళాలు స్వాగతింపబడును. తేనీయ విందు అందజేయబడును. మరిన్ని వివరాలకు స్వాతి కారి (770-548-1030) లేదా శ్రీకాంత్ కారి (404-933-2870) గార్లను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected