Connect with us

Education

సిలికానాంధ్ర మనబడి 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం

Published

on

అందరికీ నమస్కారం. సిలికానాంధ్ర మనబడి పదిహేనవ విద్యాసంవత్సరానికి (2021-22) ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలోనూ లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లోనూ నేడే నమోదు చేయండి. సెప్టెంబర్ 11 నుండి తరగతులు మొదలవును. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించబడతాయి. కోవిడ్ పరిస్థితులనుబట్టి మిగతా త్రైమాసికాల వివరాలు ముందు ముందు తెలియపరుస్తాము.

భాషాసేవయే భావితరాల సేవ అని సిలికానాంధ్ర మనబడి బలీయమైన నమ్మకం. 2000 మంది భాషాసైనికులతో 10 దేశాలలో అత్యధికంగా 250 కేంద్రాలలో 65,000 మంది విద్యార్థులతో 14 సంవత్సరాలుగా గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల సిలికానాంధ్ర మనబడి. పకడ్బందీ పాఠ్యాంశాలతో ఇప్పటికే 65 వేల మందికి పైగా పిల్లలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారు. మనబడి విద్యార్థులు చక్కటి తెలుగు నేర్చుకోవడంతో పాటు, అద్భుత నాయకత్వ పటిమ, ఎన్నో ప్రతిభాపాటవాలతో తెలుగు వెలుగులు దిశదిశలా ప్రకాశింప చేస్తూ తరతరాల భాషాభివృద్ధికి బంగారుబాట వేస్తున్నారు. కొంతమంది పద్యశతకాలు సైతం వ్రాస్తున్నారు. తెలుగు చదవడం వ్రాయడంతోపాటు భారతదేశంలోని వారి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలతో తెలుగులోనే మాట్లాడడం విశేషం. అమెరికాలో 30+ రాష్ట్రాలలోని 250 కి పైగా కేంద్రాలలోనూ, కెనడా తో పాటు, దక్షిణాఫ్రికా, సింగపూర్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ మొదలగు ఇతర దేశాలలోనూ సిలికానాంధ్ర మనబడి అప్రతిహాతంగా తెలుగు భాషాబోధన చేస్తోంది.

అట్లాంటా, జార్జియా లోని సిలికానాంధ్ర మనబడి కేంద్రాలలో నమోదు కొరకు క్రింది కరపత్రములో ఇవ్వబడిన ఆయా కేంద్రాల సమన్వయకర్తలను సంప్రదించండి. మనబడిలో చేర్పిద్దాం తెలుగు భాష నేర్పిద్దాం. నమోదు తదితర వివరాల కొరకు https://manabadi.siliconandhra.org/ మరియు ప్రశ్నలుంటే 1-844-626-BADI ని సంప్రదించండి.

విజయ్ రావిళ్ళ, ప్రాంతీయ సమన్వయకర్త

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected