Connect with us

Education

చేతన ఫౌండేషన్ ఉదారత, విజయవాడ విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ సహాయం

Published

on

చేతన ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. డిసెంబర్ 9న క్రిష్ణా జిల్లా, విజయవాడ నగరానికి చెందిన విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు తరగతులకు హాజరు అవలేక పలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అటువంటి వారి కోసం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

అందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న సిహెచ్ సాయి జాహ్నవి అనే విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ అందజేశారు. ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్దుల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టటం జరిగిందని చేతన ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవి వెనిగళ్ల, రామ్ చౌదరి ఉప్పుటూరి తెలిపారు. కష్టకాలంలో విద్యార్థులకు సహాయం చేస్తున్న చేతన ఫౌండేషన్, కోఆర్డినేటర్స్ ని అందరూ అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected