Connect with us

Convention

పెద్ద సంఖ్యలో అతిరధ మహారధులు హాజరవనున్న ‘ఆటా’ కాన్ఫరెన్స్ కి శరవేగంగా ఏర్పాట్లు

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ మొట్టమొదటిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17 వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో జులై 1 – 3 తారీకు వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కన్వెన్షన్ కి ముఖ్య అతిధులుగా సద్గురు, నందమూరి బాలక్రిష్ణ, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్ తదితరులు విచ్చేయుచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా & ట్రూప్ మ్యూజికల్ నైట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

పెద్ద సంఖ్యలో బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు హాజరవబోతున్న ఈ కార్యకమానికి దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా హాజరవుతారు అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కల్వకుంట్ల కవిత, జి.ఎం.ర్., ఉపాసన కామినేని తదితరులు ప్రత్యేక ఆహ్వానితులు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్ గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్ కి ఉత్తర అమెరికాలో తెలుగు వారు పెద్ద ఎత్తున హాజరయ్యి తెలుగు వారి ప్రత్యేకతను చాటవలసింది గా ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది.

దాదాపు 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో మినీ షాపింగ్ మాల్ తలపించనుంది. 200 కి పైగా ప్రత్యేక స్టాల్ల్స్ ప్రత్యేక ఆకర్షణ – రియల్ ఎస్టేట్, జ్యువలరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్ల్స్ ఆహుతులను అలరించనున్నాయి. మిగిలి ఉన్న అతి కొద్ది వెండర్ బూత్స్ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected